స్వామి వివేకానంద

Rate this page

స్వామి వివేకానంద

స్వామి వివేకానంద జనవరి 12, 1863న భారతదేశంలోని బెంగాల్‌ సుబాలో గల  కలకత్తా నగరంలో జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. ఆయన భారతదేశానికి చెందిన ఒక హిందూ సన్యాసి. ఆయన తత్వవేత్త, రచయిత, మత గురువు మరియు దేశభక్తుడు. ప్రాథమికంగా, ఆయన అద్వైత వేదాంత తత్వశాస్త్ర ను అనుసరించారు. ఆయన శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడు. 1881లో ఆయన రామకృష్ణ గారిని కలిశారు. ప్రారంభంలో వివేకానంద రామకృష్ణ పరమహంస యొక్క దర్శనాలను మరియు భావావేశాలను భ్రమలుగా పరిహసించారు. అయినప్పటికీ, చివరికి ఆయనను తన గురువుగా గుర్తించి, ఆయన తదనంతరం ఆయన పేర 1897లో రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. (Swamy Vivekananda)

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వివేకానందను ప్రస్తావిస్తూ ఇలా అన్నారు, ‘స్వామి వివేకానంద కృషి మరియు ఆయన వాగ్ధాటితో ఉప్పొంగిన హిందువుగా నా గర్వం, క్రైస్తవ మిషనరీ సంస్థలు హిందూ మతం పట్ల గురించి చేసే ఆక్షేపణ నా మనసును తీవ్రంగా గాయపరిచింది’.

వివేకానంద 1893లో అమెరికాలోని చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంట్‌లో పాల్గొన్నారు. ఆ తరువాత ఆయన జనవరి 1897లో అమెరికా నుండి శ్రీలంకలోని కొలంబోకు చేరుకున్నారు. ఆయన రామేశ్వరంలోని ప్రసిద్ధ వివేకానంద శిలపై ధ్యానం చేశారు. ఆ తర్వాత ఆయన మధురై, కుంభకోణం, మద్రాసులకు ప్రయాణించి, చివరికి కలకత్తాకు చేరుకున్నారు. వివేకానంద పశ్చిమ దేశాలలో భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక వారసత్వాన్ని నొక్కి చెప్పినప్పటికీ, భారతదేశంలో ప్రబలి ఉన్న పేదరికం, కుల వ్యవస్థ నిర్మూలన, విజ్ఞాన శాస్త్రం మరియు పారిశ్రామికీకరణలో పురోగతి, వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం వంటి భారతీయ సమస్యలపై నిరంతరం దృష్టి సారించడం గమనార్హం. ‘కొలంబో నుండి అల్మోరా వరకు ఉపన్యాసాలు’గా ప్రచురించబడిన ఈ ప్రసంగాలు ఆయనకు గల ప్రగాఢమైన దేశభక్తిని సూచిస్తాయి.

ఆయన ఒకసారి ఇలా అన్నారు, “భారతదేశానికి ఉన్న ఏకైక ఆశ సామాన్య ప్రజలే. ఉన్నత వర్గాలు శారీరకంగాను, నైతికంగా చనిపోయాయి”.

ఆయన ఆచారాల గురించి చేస్తున్న అర్థరహితమైన అధిభౌతిక చర్చలను, వాదనలను, ముఖ్యంగా ఉన్నత వర్గాలు వారి టచ్-మీ-నాటిజాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “మన మతం వంటగదిలో ఉంది. మన దేవుడు వంట పాత్రలో ఉన్నాడు మరియు మన మతం: `నన్ను తాకవద్దు, నేను పవిత్రుడిని’ అంటుంది” అని విమర్శించారు.

నరేంద్రనాథ్ దత్త కలకత్తా నగరంలోని ఒక సంపన్న కుటుంబం నుండి వచ్చారు. ఆయన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్థాపించిన మెట్రోపాలిటన్ పాఠశాలలో విద్యను అభ్యసించారు. తండ్రి వృత్తి కారణంగా ఆయన రాయ్‌పూర్‌లోని పాఠశాలలో కొంతకాలం చదువుకున్నారు. ఆయన ఉన్నత విద్యను కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో అభ్యసించారు. ఆయన తత్వశాస్త్రం, చరిత్ర, సామాజిక శాస్త్రాలు, కళ మరియు సాహిత్యం వంటి విభిన్న అంశాలను చదివారు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, భగవద్గీత వంటి హిందూ గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు. ఆయన సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆయన శారీరక వ్యాయామాలు, క్రీడలు మరియు అథ్లెటిక్ పోటీలలో పాల్గొనేవారు. ఆయన స్కాటిష్ చర్చి కళాశాలలో తర్కం, తత్వశాస్త్రం మరియు పాశ్చాత్య చరిత్రను కూడా అభ్యసించారు. ఆయన 1881లో ఫైన్ ఆర్ట్స్ పరీక్ష పూర్తి చేసి 1884లో బి.ఎ. డిగ్రీని పొందారు.

డేవిడ్ హ్యూమ్, హెగెల్, స్కోపెన్‌హౌర్, అగస్టే కామ్టే, జె.ఎస్. మిల్, మరియు చార్లెస్ డార్విన్ వంటి అనేక మంది పాశ్చాత్య తత్వవేత్తల రచనలను స్వామి వివేకానంద పరిశీలించారు. హెర్బర్ట్ స్పెన్సర్ పరిణామవాద సిద్ధాంతానికి ఆయన ఆకర్షితుడయ్యారు. మరియు ఆయనతో సంభాషించాడు. స్పెన్సర్ పుస్తకం ఎడ్యుకేషన్ ను ఆయన బెంగాలీ భాష లోకి అనువదించారు.

ఆ విధంగా, స్వామి వివేకానంద స్వాభావికంగా ఒక తత్వవేత్త అని గమనించవచ్చు.

నరేంద్రనాథ్ దత్త తండ్రి 1884లో అకాల మరణం ఆయన జీవిత గమనాన్ని మార్చివేసింది. ఆయన కుటుంబం దివాళా తీసింది. ఉపాధి కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన దేవుని ఉనికిని అనుమానించాడు. కానీ రామకృష్ణ పరమహంసలో ఓదార్పును పొందాడు. రామకృష్ణ నివసించే దక్షిణేశ్వరానికి ఆయన తరచుగా వెళ్లడం ప్రారంభించాడు.

తన గురువు రామకృష్ణ పరమహంస మరణానంతరం, ఆయన 1887లో రామకృష్ణ మిషన్‌ను స్థాపించారు. 1888లో, నరేంద్రనాథ్ తన సహచరులతో కలిసి, చేతిలో కమండలం మరియు దండం ధరించి, ఒక పరివ్రాజకుడిగా అంటే సంచార సన్యాసిగా మఠం నుండి బయలుదేరారు. ఆయన ఐదేళ్లపాటు కాలినడకన మరియు రైలులో భారతదేశమంతటా పర్యటించి, విజ్ఞాన కేంద్రాలను సందర్శించారు. మరియు వివిధ మత ఆచారాలు, సామాజిక వ్యవస్థల గురించి తెలుసుకున్నారు. ఈ ప్రయాణంలో, ఆయన వివిధ మతాలు మరియు నేపథ్యాలకు చెందిన భారతీయులను కలిశారు. మరియు వారితో నివసించారు: విద్యావేత్తలు, దివాన్‌లు, రాజులు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, పారయ్యలు మరియు ప్రభుత్వ ఉద్యోగులు. తద్వారా భారతదేశంలోని సామాజిక-ఆర్థిక పరిస్థితుల గురించిన అంశాలను పరికించారు.

బహుశా, సురేంద్రనాథ్ బెనర్జీ తర్వాత భారతదేశమంతటా పర్యటించిన రెండవ వ్యక్తి స్వామి వివేకానంద కావచ్చు.

స్వామి వివేకానంద బ్రహ్మ సమాజంలో కూడా సభ్యులుగా ఉన్నారు. బ్రహ్మ సమాజానికి చెందిన ప్రతాప్ చంద్ర మజుందార్, ప్రపంచ మతాల పార్లమెంట్ ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉండి, పార్లమెంట్‌లో పాల్గొనడానికి స్వామి వివేకానంద దరఖాస్తును సపోర్ట్ చేశారు. ఈ విధంగా, ఆయన మే 31, 1893న బొంబాయి నుండి చికాగోకు బయలుదేరారు. పార్లమెంట్ మొదటి రోజున ప్రసంగించే అవకాశం వివేకానందకు లభించింది. ఆయన “అమెరికా సోదర సోదరీమణులారా!” అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆయన వ్యాఖ్యలు విన్న సభకు హాజరైన సుమారు 7,000 మంది లేచి నిలబడి 2 నిమిషాల పాటు కరతాళధ్వనులతో వివేకానందను అభినందించారు. నిశ్శబ్దం నెలకొన్న తర్వాత, ఆయన సమకాలీన ప్రపంచ దేశాలలో అమెరికాను అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తిస్తూ, భారతదేశపు ప్రాచీన నాగరికత తరపున అమెరికన్లకు స్వాగతం పలికారు. ఆయన “శివ మహిమ్న స్తోత్రం”లోని ఒక విభాగాన్ని (7వ శ్లోకం) ఉదహరించారు:

త్రయి సన్ఖ్యాం యోగః పశుపతిమతం వైశ్ణవమితి |

ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పథ్యమితి చ్ |

రుచీనాం వైచిత్ర్యాద్ర్జుకుటిల్ నానాపథజుషామ్ నృణామ్ |

ఏకొ గమ్యస్త్వమసి పయసామర్ణవ్ ఇవ

(నాకు వేరొక వెబ్ సైట్ కూడా ఉందని తెలియజేయుటకు సంతసించు చున్నాను. ఆ వెబ్ సైట్ లో భారతీయ హిందు సంస్కృతిహిందూ సనాతన ధర్మమువేద సూక్తములు, మొదలైన అంశములపై వ్యాసములు గలవు. ఆ వెబ్ సైట్ ను కూడా సందర్శించి సదరు వ్యాసములను చదివి ఆకళింపు చేసుకుని మీ అభిప్రాయములు తెలియ జేయవలెను.)

అర్థం: వివిధ ప్రదేశాలలో ఉద్భవించిన వేర్వేరు నదులన్నీ తమ నీటిని సముద్రంలో ఎలా కలుపుతాయో, అలాగే ఓ ప్రభూ, మనుషులు వేర్వేరు ప్రవృత్తుల ద్వారా అనుసరించే విభిన్న మార్గాలు, అవి ఎంత భిన్నంగా కనిపించినా, వంకరగా ఉన్నా లేదా సీదాగా ఉన్నా, అవన్నీ నిన్నే చేరతాయి!”.

ఆయన భగవద్గీత నుండి ఒక శ్లోకాన్ని కూడా ఉదహరించారు (శ్లోకం 4.11).

యె యథా మాం ప్రపద్యన్తె తాంస్తథైవ్ భజామ్యహమ్‌  |

 మమ్ వర్త్మానువర్తన్తె మనుష్యా: పార్థ్ సర్వశ్:  ||

అంటే, “ఎవరు ఏ రూపంలో నా వద్దకు వచ్చినా, నేను వారిని చేరుకుంటాను; మనుషులందరూ చివరికి నా వద్దకు దారితీసే మార్గాల ద్వారానే ప్రయాణిస్తున్నారు.”

పూర్వం నుండి భారతీయ హిందూ మత ప్రాముఖ్యతను పశ్చిమ దేశాల పండితులు చక్కగా గుర్తించారు. అయితే, వివేకానందుని ప్రసంగం, ముఖ్యంగా ఆనాటి వార్తాపత్రికలు మరియు పత్రికల వంటి మీడియా కారణంగా, పశ్చిమ దేశాలలోని సాధారణ ప్రజలలోకి హిందూ మత విశిష్టత ప్రాబల్యం లోకి వచ్చింది. వివేకానందుడు యునైటెడ్ స్టేట్స్ యొక్క తూర్పు మరియు మధ్య ప్రాంతాలలో, ప్రధానంగా చికాగో, డెట్రాయిట్, బోస్టన్ మరియు న్యూయార్క్‌లలో ప్రసంగాలు చేసే అవకాశం పొందారు. ఆయన యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు రెండు సంవత్సరాలు గడిపారు. ఆయనకు వివిధ విశ్వవిద్యాలయాలలో అధ్యాపక పదవులు లభించినప్పటికీ, అవి తన సన్యాసి జీవితానికి సరికావని పేర్కొంటూ ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు.

1894లో, ఆయన న్యూయార్క్‌లో వేదాంత సొసైటీని స్థాపించారు.

ఆయన 1895 మరియు 1896 సంవత్సరాలలో లండన్‌కు చాలాసార్లు ప్రయాణించారు. ఆక్స్‌ఫర్డ్‌లో ఆయన మాక్స్ ముల్లర్‌ను కలిశారు. ఈ సంఘటన జర్మనీలో మరియు యూరప్ అంతటా వేదాంత తత్వశాస్త్రాన్ని గణనీయంగా ప్రోత్సహించింది.

వివేకానంద ఫ్రాన్స్‌ను సందర్శించిన తర్వాత, తదనంతరం సెంటర్ వేదాంటిక్ రామకృష్ణ (ఫ్రాన్స్) స్థాపించబడింది. 1896లో ప్రొఫెసర్ పాల్ డ్యూసెన్‌ను వివేకానంద సందర్శించిన జ్ఞాపకార్థం జర్మనీలో వేదాంత గెసెల్‌షాఫ్ట్ (జర్మనీ) స్థాపించబడింది.

ఆయన 1899లో మరోసారి అమెరికాను సందర్శించాడు. ఈ పర్యటనలో సిస్టర్ నివేదిత మరియు స్వామి తురియానంద అతనితో పాటు ఉన్నారు. ఆయన 1900లో శాన్ ఫ్రాన్సిస్కోలో వేదాంత సొసైటీని స్థాపించాడు. 1900లో జరిగిన మతాల కాంగ్రెస్‌లో పాల్గొనడానికి ఆయన పారిస్‌కు ప్రయాణించారు.

స్వామి వివేకానంద జూలై 4, 1902న అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు.

స్వామి వివేకానంద యూరప్ మరియు అమెరికా పర్యటనలు పాశ్చాత్య ప్రజలపై ఎంతగానో ప్రభావం చూపాయి, దాని ఫలితంగా ఆయన అకాల మరణం తర్వాత ఆయన జ్ఞాపకార్థం వారు అనేక మఠాలను స్థాపించారు.

ప్రస్తుతం, వేదాంత అధ్యయనం మరియు ఆధ్యాత్మిక సాధన కోసం అంకితం చేయబడిన సుమారు 7 రామకృష్ణ కేంద్రాలు యూరప్‌లో ఉన్నాయి, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

France: Centre Védantique Ramakrishna (Gretz-Armainvilliers)

United Kingdom: Ramakrishna Vedanta Centre (Bourne End, near London)

Germany: Vedanta Gesellschaft (Berlin, Steinebach/Sieg, and Frankfurt region)

Russia: Vedanta Moscow

Switzerland: Centre Védantique (Geneva)

Netherlands (Holland): Ramakrishna Vedanta Society (Drenthe)

Ireland: Vedanta Ireland

రామకృష్ణ మిషన్

మొత్తానికి రామకృష్ణ మిషన్ మరియు దాని మఠం ప్రపంచవ్యాప్తంగా 279 కేంద్రాలను కలిగి ఉన్నాయి, వాటిలో అమెరికా, రష్యా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫిజి, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, మలేషియా, మారిషస్, నేపాల్, నెదర్లాండ్స్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్ మరియు జాంబియా ఉన్నాయి.

రామకృష్ణ మిషన్ యొక్క భారతీయ ప్రధాన కార్యాలయం బేలూర్ మఠం కలకత్తా లో ఉంది. ఇది భారతదేశం అంతటా 211 ప్రాథమిక శాఖలను కలిగి ఉంది. భారతీయ మిషన్ ధార్మిక ప్రయత్నాలపై కూడా దృష్టి పెడుతుంది. రామకృష్ణ మిషన్ భారతదేశంలో హిందూ మతానికి పునరుజ్జీవనకారిగా పనిచేస్తుంది.

బేలూరు మఠం మరియు రామకృష్ణ మిషన్ భారతదేశంలో 748 విద్యా సంస్థలను (12 కళాశాలలు, 22 హయ్యర్ సెకండరీ పాఠశాలలు, 41 సెకండరీ పాఠశాలలు, ఇతర తరగతుల 135 సంస్థలు, 4 పాలిటెక్నిక్‌లు, 48 వృత్తి శిక్షణా కేంద్రాలు, 118 హాస్టళ్లు, 7 అనాథాశ్రమాలు మొదలైనవి) నిర్వహిస్తోంది. ఈ సంస్థలలో దాదాపు 200,000 మంది విద్యార్థులు విద్యలను అభ్యశిస్తుంటారు.

(యూ ట్యూబ్ చానల్ లో నా ఈ వీడియోలను వీక్షించండి: River Saraswatiసరస్వతి నది ఆచూకీ, Birth place of Hanuman, Location of Brahmavartaబ్రహ్మావర్తముAryanismఆర్యజాతి వాదము. )